Chandrababu Arrest Updates: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్(AP CID Chief Sanjay Kumar) సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్(Skill Development Scam) జరిగినట్లు గుర్తించామన్నారు. ఇదే విషయమై ప్రెస్మీట్ పెట్టి వివరాలను వెల్లడించారు సంజయ్ కుమార్. సిమెన్స్ ద్వారా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంవోయూలో పేర్కొనలేదని స్పష్టం చేశారు. రూ. 241 కోట్లు నేరుగా ఒక కంపెనీకి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు వెళ్లాయని వివరించారు. ఈ కేసులో 10 అంశాలను గుర్తించామన్నారు. ఈ కేసులో ఈడీ ఎంటర్ అయిందని, చాలా మందిని అరెస్ట్ చేసిందన్నారు. 2021లో ఏపీ సీఐడీ ఈ స్కామ్పై కేసు నమోదు చేసిన తరువాత చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు సంజయ్ కుమార్. చంద్రబాబు 13 ప్రదేశాల్లో సంతకాలు చేశారని వివరించారు ఏసీ సీఐడీ చీఫ్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రూ. 370 కోట్లు రిలీజ్ చేయమని ఆర్డర్ చేశారని తెలిపారు. జె వెంకటేశ్వర్లు అనే ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నారని అన్నారు
పూర్తిగా చదవండి..Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై సంచలన వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్..
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించామన్నారు.
Translate this News: