Bandi Sanjay: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు తమ స్పందన తెలియజేస్తున్నారు. బాబు అరెస్టు పట్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే తప్ప ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని తెలిపారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం రూల్స్ పాటించకుండా అంతా హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. అలాగే వైసీపీ నేతలకు ఓ దరిద్రపు అలవాటు ఉందని.. నిజాలు మాట్లాడినందుకు ఇప్పుడు తనను కూడా చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ కల్యాణ్ ఏజెంట్ అంటారని సెటైర్లు వేశారు. వైసీపీ నాయకులు ఏమైనా నీతిమంతులా..? సత్యహరిశ్చంద్రులా..? అని దుయ్యబట్టారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగింది.. వైసీపీ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు తమ స్పందన తెలియజేస్తున్నారు. బాబు అరెస్టు పట్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: