రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు గతంలో సర్కార్ ఓ కమిటీని కూడా నియమించింది. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా…విద్యార్థులు మానసిక ఒత్తిడి, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఎనిమిది నెలల కాలం నుంచి ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జార్ఖండ్కు చెందిన 16 ఏళ్ల రీచా సిన్హా రాజస్థాన్ జిల్లాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బుధవారం పోలీసులు సమాచారం అందించారు హాస్టల్ సిబ్బంది.
పూర్తిగా చదవండి..Suicide in kota : కోట ఆత్మహత్యల అడ్డ…మరో విద్యార్థి బలి…!!
కోటాలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు ఆగడం లేదు. మరో విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్కు చెందిన 16 ఏళ్ల నీట్ ఆకాంక్ష రాజస్థాన్ జిల్లాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Translate this News: