Chandrababu: చంద్రబాబు రిమాండ్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినించగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. అలాగే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరిచాలని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి 11.30గంటల నుంచి పోలీసులు చంద్రబాబును ముట్టడించారన్నారు. కనుక అప్పటి నుంచే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు భావించాలని కోరారు. నంద్యాలలో కోర్టు ఉండగా విజయవాడకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబును పోలీసుల కాల్ రికార్డులను కోర్డులకు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu: ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు
చంద్రబాబు రిమాండ్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినించగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
Translate this News: