World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల నుంచి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో బీసీసీఐ మరోసారి టికెట్ల విక్రయాలను ప్రారంభించింది. అన్ని మ్యాచ్ల కోసం మొత్తం 4లక్షల టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అభిమానుల డిమాండ్ నేపథ్యంలో వివిధ మ్యాచ్లు నిర్వహించే రాష్ట్ర సంఘాలతో మాట్లాడి 4 లక్షల టిక్కెట్లను విక్రయించేందుకు అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..World Cup: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరో 4లక్షల టికెట్లు రిలీజ్
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: