Agenda of G20 Summit: సరిహద్దులు, భాషాభేదాలు, భావజాలాలకు అతీతంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకే కుటుంబంగా పురోభివృద్ధి చెందడమే G-20 (G20 Summit) ముందున్న లక్ష్యం. పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంబించాలని జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిస్తున్నాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు కోరుకుంటోంది. ‘లైఫ్’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో చాలా పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా మూడు అంశాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్థూలదేశీయోత్పత్తి అంటే జీడీపీ, చైన్ సప్లై, దేశాల మధ్య విశ్వసనీయతను ప్రపంచం గుర్తిస్తోంది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవశ్యకత, మరిన్ని దేశాల ప్రాతినిధ్యం పెంచడం వంటి అంశాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.
పూర్తిగా చదవండి..G20 Summit: ప్రపంచం చూపు భారత్ వైపు.. జీ20 సమావేశాల ఎజెండా ఏమిటి..?
ఢిల్లీ వేదికగా నిర్వహించే G20 సమ్మిట్లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏ ఏ వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి.
Translate this News: