G20 Summit : ఢిల్లీలో జీ20 సదస్సు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న జి 20 సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో దేశాల జాతీయ అధ్యక్షులు కూడా పాల్గొంటారు. రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి ముందు ఐదుకు పైగా మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మెట్రో స్టేషన్ గోడలపై రాసిన నినాదాలను చెరిపివేసారు.
పూర్తిగా చదవండి..G20 Summit : ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఖలిస్థాన్ నినాదాలు..జీ20 సమావేశాల వేళ టెన్షన్..!!
సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూల నుంచి విదేశీ అతిథులు ఢిల్లీకి రానున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపుతున్నాయి. సిక్కు ఫర్ జస్టిస్ అనే నినాదాలను మెట్రో స్టేషన్ గోడలపై రాసారు. దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది ఢిల్లీలో ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీకి సంబంధించి ఇది రెండో సంఘటన.
Translate this News: