West Bengal Explosion: పశ్చిమబెంగాల్లో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లా దత్పుకూర్ ప్రాంతంలోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఈ పేలుడులో 8మంది మరణించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. పేలుడు చాలా బలంగా ఉండడంతో ఆ ప్రాంతంలోని పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. 100 మీటర్ల దూరంలో మృతదేహాలు ఎగిరిపడ్డాయి.
పూర్తిగా చదవండి..West Bengal : భారీ పేలుడు…8 మంది దుర్మరణం..!!
పశ్చిమ బెంగాల్లో భారీ పేలుడు సంభవించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దత్పుకూర్ ప్రాంతంలోని అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. మజ్పూర్ జగన్నాథ్పూర్ సమీపంలోని ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్యలో బాణాసంచా తయారీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు.
Translate this News: