TS EAMCET Counselling 2023: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఎంసెట్-2023 (TS EAMCET) కౌన్సెలింగ్లో భాగంగా మూడు విడతల సీట్లకేటాయింపు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత రాష్ట్రంలో ఇంకా 19 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఇవాళ్టి నుంచి స్పెషల్ కౌన్సెలింగ్ను టీఎస్ ఉన్నత విద్యామండలి నిర్వహింస్తున్నారు. ఇందులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచీల్లో చాలా సీట్లు మిగిలిపోయాయి. అయితే ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు ప్రత్యేక కౌన్సెలింగ్ జరుగనుంది.
పూర్తిగా చదవండి..TS EAMCET: టీఎస్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్..కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ
ఇంజినీరింగ్ చివరి దశ సీట్లు కేటాయింపు పూర్తయింది. తెలంగాణ ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేశారు. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి నేటి నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వెల్లడించారు.
Translate this News: