దేశంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం కింద సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతులు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు.. ట్రాక్టర్ ధర రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో కేంద్రం రూ.5 లక్షలు భరిస్తుంది. మరో రూ. 5 లక్షలు బ్యాంకులు రైతుకు రుణంగా ఇస్తాయి. అంతేకాదు వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తాయి. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయి. ప్రతి చిన్న, సన్నకారు రైతు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత పొలం లేని కౌలు రైతులు.. యజమాని నుంచి ఎన్ఓసీ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు.
పూర్తిగా చదవండి..రైతుల కోసం మరో అద్భుత పథకం.. సగం ధరకే ట్రాక్టర్లు అందజేత
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం కింద సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే వెసులుబాలు కల్పిస్తోంది. ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతులు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు.
Translate this News: