Meri Mati Mera Desh :
ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవం (77th Independence Day) ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ వారం 103వ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ (PM Modi) ఈ విషయాన్ని వెల్లడించారు. మేరీ మాటి మేరా దేశ్ పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..