Actress Jatwani: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. జెత్వానీ వేధింపుల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. కాగా అప్రూవర్గా మారిన అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ.. జత్వాని కేసుకు సంబంధించిన కీలక సమాచారంతో కూడిన మూడు పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఈ మేరకు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..Jatwani: ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి!
ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీ చెప్పారు. విశాఖకు బదిలీ చేసినా కేసు పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Translate this News: