CM Revanth: కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల జోలికొస్తే వీపు చింతపండు చేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తమ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా మంచి తనాన్ని చేతకానితనంగా తీసుకుంటే ఉరికిచ్చి కొడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆదివారం గాంధీభవన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. మహేష్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని, 27 జూన్ 2021న తనను టీపీసీసీ అధ్యక్షుడుగా నియమించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth: మా జోలికొస్తే వీపు చింతపండే.. బీఆర్ఎస్కు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!
తమ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, ఎవరైనా తమ జోలికొస్తే అసలే ఊరుకోమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమన్నారు సీఎం.
Translate this News: