TG News: భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములకలపల్లి మండలం సీతారాంపురం ముర్రేడు వాగు బ్రిడ్జి వద్ద స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోని కారు ఢీ కొట్టడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆటోడ్రైవర్ సహా మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు పాల్వంచ పట్టణంలోని DAV, త్రివేణి, రెజీనా పాఠశాలలకు చెందిన వారిగా గుర్తించారు. మృతిచెందిన విద్యార్థి డీఏవీ స్కూల్లో ఆరోతరగతి చదువుతున్న ఈశ్వర్గా గుర్తించారు. క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు.
పూర్తిగా చదవండి..TG News: భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-కారు ఢీ.. ఒకరి మృతి!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి (మం) సీతారాంపురం ముర్రేడువాగు బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Translate this News: