Janagam District: స్కూల్ కు అని వెళ్లిన విద్యార్ధి రైలు పట్టాలపై శవమై తేలాడు. ఈ అనుమానాస్పద ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. కొడారి రాజ్ కుమార్ అనే విద్యార్ధి స్టేషన్ఘన్పూర్లోని సెయింట్ థామస్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు లానే రాజ్ ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళాడు. కానీ కొంత సమయం తర్వాత రాజ్ కుమార్ స్కూల్ లో కనిపించకపోవడంతో స్కూల్ యాజమాన్యం అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాజ్ కుమార్ స్కూల్ నుంచి పారిపోయినట్లు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..Janagam District: స్కూల్ కు వెళ్లి.. రైలు పట్టాలపై శవమై కనిపించిన విద్యార్ధి..!
జనగామ జిల్లాలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. స్కూల్ నుంచి తప్పిపోయిన రాజ్ కుమార్ కొంతసమయానికి చిల్పూర్ వంగాలపల్లి రైల్వే పట్టాలపై మృతదేహమై కనిపించాడు. అతని మృతి పట్ల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: