TG News: వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. చిన్నారిని వీధి కుక్కలు పీక్కుతిన్న ఘటనతో అక్కడి ప్రజలంతా భయపడుతున్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ మహిళ పది నెలల బాబును చెట్టు కింద ఉంచి పనిమీద వెళ్లింది. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా బాబు ఆచూకీ లభించలేదు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
పూర్తిగా చదవండి..TG News: చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు.. తెలంగాణలో మరో దారుణం!
బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు.
Translate this News: