Telangana : తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పేషీలో స్వల్ప మార్పులు చేస్తున్నారు. తాజాగా మహిళా అధికారిణికి సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న దివ్యరాజన్ కు ఆ అవకాశం దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దివ్యరాజన్ 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వివాద రహితురాలిగా, బెస్ట్ ఆఫీసర్ గా ఆమెకు పేరుంది. దీంతో ఆమెను తన పేషీలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Revanth Reddy : సీఎం పేషీలోకి డైనమిక్ ఆఫీసర్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యాక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన ఐఏఎస్ అధికారిణి దివ్యరాజన్ ను సీఎంఓలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలను ఆమె చేసిన కృషి కారణంగా ఈ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది.
Translate this News: