Telugu news సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లతో కలకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. నర్సాపూర్లో జరిగిన సభ ప్రాంగణంలో ఓ వ్యక్తి రెండు బుల్లెట్లతో పట్టుబడిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం చండూరుకు చెందిన అస్లం ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానల్కు విలేఖరిగా వ్యవహరిస్తున్నాడు. ఆ క్రమంలోనే సీఎం సభ కవరేజీ కోసం నర్సాపూర్ వచ్చాడు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా పర్సులో రెండు బుల్లెట్లను గుర్తించారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీ కేడెట్గా ఉన్నాడని, ఆ సమయంలో ఎన్సీసీ ట్రైనింగ్ నుంచి అక్రమంగా రెండు 7.65ఎంఎం బుల్లెట్లు తెచ్చాడని నర్సాపూర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.
ఆమె మద్దతు టీమిండియాకే.. సస్పెన్స్ కు తెరదించిన వాజ్మా
ODI World Cup 2023 వాజ్మా అయూబీ.. ఏ స్టార్ క్రికెటర్కూ ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ఇప్పుడామె సొంతం. తమ జట్టు ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా అక్కడ వాలిపోయే ఈ ఆఫ్ఘన్ సోషల్ మీడియా క్వీన్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్కు జై కొట్టింది. వాజ్మా ఏ టీంకు సపోర్ట్ చేస్తుందోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చేసింది. కోహ్లీ నంబర్తో ఉన్న జెర్సీ ధరించిన ఫొటోను ట్వీట్ చేసి భారత అభిమానుల మనుసు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: ర్యాంకింగ్ లో టాపు, వరల్డ్ కప్ లో తోపు: సెంటిమెంట్ వర్కౌట్ అయితే కప్పు మనదే!
ఎవరీ వాజ్మా?
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని కుందుజ్లో పుట్టిన వాజ్మా పేద్ద క్రికెట్ ఫ్యాన్. ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆఫ్ఘాన్ జెండాతో అక్కడ వాలిపోతుంది. అందం, ఆటిట్యూడ్ కలగలిసి సరిహద్దులకు అతీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. చిన్నప్పుడే తన కుటుంబం అమెరికా వెళ్లడంతో కొలరాడోలో పెరిగింది. ‘లామన్’ బ్రాండ్తో దుస్తులను మార్కెట్లోకి తెచ్చి ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోనూ మెరుస్తోంది. సోషల్ యాక్టివిస్ట్గా కూడా క్రియాశీలకంగా ఉంది. గతేడాది జరిగిన టీ 20 ఆసియా కప్లో మెరుపుతీగలా ఫ్యాన్స్ను తనవైపు తిప్పుకున్న వాజ్మా ఇప్పుడు భారత్లోనే ఉంది. సెమీ ఫైనల్ మ్యాచులో స్టేడియంలో కనిపించింది. టీమిండియాకు సపోర్ట్గా ఫైనల్ మ్యాచ్కు కూడా స్టేడియానికి వస్తుందట!
ఇది కూడా చదవండి: ‘విరాట్’ ప్రదర్శనను సెంటిమెంట్ అడ్డుకుంటుందా!: అభిమానుల్లో కలవరం
‘విరాట్’ ప్రదర్శనను సెంటిమెంట్ అడ్డుకుంటుందా!: అభిమానుల్లో కలవరం
ODI WC 2023: కోహ్లీ.. ఇప్పుడు కోట్లాదిమంది భారత క్రికెట్ అభిమానుల హృదయ స్పందన. కెరీర్ లో ది బెస్ట్ ఫాంలో ఉన్న కింగ్ ఈ వరల్డ్ కప్ లో చాలా మ్యాచుల్లో ఒంటిచేత్తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. రన్ మెషీన్ పరుగుల ప్రవాహం అలాగే సాగితే టీమిండియా వరల్డ్ కప్ ఎగరేసుకుపోవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే, ఇక్కడే ఓ విషయం అభిమానులను కలవరపరుస్తోంది.
ఇది కూడా చదవండి: ర్యాంకింగ్ లో టాపు, వరల్డ్ కప్ లో తోపు: సెంటిమెంట్ వర్కౌట్ అయితే కప్పు మనదే!
2003నాటి గ్రాండ్ టోర్నీలో సచిన్ పరుగులు పారించాడు. ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించిన లిటిల్ మాస్టర్ ఫైనల్ లో మాత్రం తడబడ్డాడు. అంతకుముందరి సెమీస్ లో సచిన్, గంగూలీ క్లాస్ ఇన్నింగ్స్ తో జట్టును ఫైనల్ కు చేర్చినా.. తుదిపోరులో బ్యాట్లెత్తేశారు. రాంగ్ షాట్ తో సచిన్ క్యాచ్ ఇచ్చేశాడు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. భారత క్రికెట్ పై సెంటిమెంట్ల ప్రభావం ఎంతగా ఉంటుందో తెలిసిందే కదా! ఆ ప్రపంచకప్ తో పోలిస్తే రెండు పదుల ఏళ్ల తర్వాతి ఈ వరల్డ్ కప్ కు అనేక పోలికలున్నాయి. అప్పట్లాగే ఈ సారీ కంగారూ జట్టే మన ప్రత్యర్థిగా ఉంది. అప్పుడు లిటిల్ మాస్టర్ సిరీస్ లో హయ్యెస్ట్ రన్స్ స్కోర్ చేయగా, ఇప్పుడు కోహ్లీ అంతకుమించిన పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అప్పుడు సచిన్ లాగే ఈ సారీ సెమీఫైనల్ లో కోహ్లీ అదరగొట్టేశాడు. ఇంకా, సెంచరీల హాఫ్ సెంచరీతో లిటిల్ మాస్టర్ ను దాటేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. ఇన్ని పోలికలున్న ఈ మ్యాచ్ లో అప్పుడు సచిన్ లాగే ఇప్పుడు కోహ్లీ ఔటైతే… ఇదే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది రిపీట్ కాకూడదని, కింగ్ విరాట్ ప్రదర్శన చేయాలని ప్రార్థనలు చేస్తున్నారు.
ర్యాంకింగ్ లో టాపు, వరల్డ్ కప్ లో తోపు: సెంటిమెంట్ వర్కౌట్ అయితే కప్పు మనదే!
IND vs AUS WC Final 2023: యాధృచ్ఛికమే కావచ్చు! తలపండిన క్రీడా విశ్లేషకుల అంచనాలు తప్పినా, క్రికెట్ లో సెంటిమెంట్లు మాత్రం చాలాసార్లు వర్కవుట్ అవుతుంటాయి. ఇక క్రికెట్ ను మతంగా భావించే భారత్ లో ఆ సెంటిమెంట్లకు బలం మరింత ఎక్కువే. అంచనాలని చెప్పలేం, విశ్లేషణలని అసలే అనలేం.. అవి జస్ట్ సెంటిమెంట్స్, అంతకన్నా ఎక్కువగా ఎమోషన్స్! అంతే! వీటి గోల ఇప్పుడెందుకంటే.. అందరికీ తెలిసిందే అయినా, మరోసారి చెప్పుకుందాం.
నంబర్ వన్ జట్టే నెగ్గుతుందా?!
టీమిండియా ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉంది. గత రెండు ప్రపంచ కప్పుల్లోనూ టాప్ టీంలే కప్పును ఎగరేసుకుపోయాయి. 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ నంబర్ వన్ హోదాలోనే పోటీకి దిగి ట్రోఫీ నెగ్గాయి. ఇప్పుడూ అదే సెంటిమెంట్ టీమిండియాకు కలిసొస్తుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఉన్నారు.
ఆతిథ్య జట్టే వరల్డ్ కప్ గెలుస్తుందా?!
2011 వరల్డ్ కప్ గుర్తుంది కదా! ధోనీ, గంభీర్ వీరోచిత పోరాటం; భారత్ చారిత్రక విజయం క్రికెట్ ఫ్యాన్స్ కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంటాయి. అప్పుడు వరల్డ్ కప్ జరిగింది మనదేశంలోనే. 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్లో వరల్డ్ కప్ జరగ్గా ఆ దేశాలే కప్ కైవసం చేసుకున్నాయి. 2019 ఫైనల్ ఎంతలా నరాలను తెంచేసిందో చూశాం కదా. అంతటి ఉత్కంఠలోనూ ఆతిథ్య జట్టే గెలుపొందడం సెంటిమెంట్ కాక మరేమిటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 12 ఏళ్లకు మళ్లీ భారత్ లోనే జరుగుతున్న ప్రపంచ కప్ లో అదే సెంటిమెంట్ రిపీట్ కావడం ఖాయమంటున్నారు అభిమానులు.
ప్రతీకార మంత్రం పనిచేస్తుందా?!
2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ కు ముందు బోల్తాకొట్టింది. చేతికందిన మ్యాచ్ ను కీలకమైన దశలో న్యూజిలాండ్ లాక్కుంది. ఫలితం మనకు తెలిసిందే. అయితే, ఈ సెమీఫైనల్ లో అదే న్యూజిలాండ్ పై ఘనవిజయంతో టీమిండియా తుదిపోరుకు దూసుకెళ్లింది. ఈ రివేంజ్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి 2003 వరల్డ్ కప్ ఫైనల్ పరాజయానికి ఆసిస్ పై భారత్ బదులు తీర్చుకుంటుందని ఫ్యాన్స్ కుండబద్దలు కొడుతున్నారు.
తాళి కట్టడానికి నిమిషం ముందు ఏం జరిగిందో తెలుసా!: పీటల మీదే ఆగిన పెళ్లి
‘ఆపండి!’… దాదాపు పాత తెలుగు సినిమాలన్నిట్లో వినిపించే డైలాగ్ ఇది. హీరోయిన్ పెళ్లి పీటల మీద కూర్చుని ఉండగా, పెళ్లికొడుకు తాళికట్టే ఒక్క సెకను ముందు హీరోయిన్ ప్రియుడో, పోలీసులో, స్నేహితులో, మరొకరో వచ్చి పెళ్లి ఆపడాన్ని ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే, ఈ సంఘటన అంతకు మించి!
తాళి కట్టు శుభవేళ… అని గాల్లో తేలిపోతూ పెళ్లికొడుకు మూడు ముళ్లూ వేయడానికి రెడీ అయిపోతుండగా, అప్పటిదాకా పీటల మీదే ఉన్న వధువు ఒక్కసారిగా లేచి తనకా పెళ్లి వద్దంటే వద్దని తేల్చేసింది. అప్పటిదాకా సిగ్గులొలకబోసిన పెళ్లికూతురు ఒక్కసారిగా షాకివ్వడంతో బంధువులంతా అవాక్కయ్యారు. బాజాభజంత్రీలు ఆగిపోయాయి.. వరుడి ముఖం చిన్నబోయింది. విషయమేంటని గట్టిగా నిలదీస్తే పెళ్లికొడుక్కు నత్తి ఉందని, పెద్దగా చదువుకోలేదని చెప్పిందట ఆ అమ్మాయి. వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Congress Job Calendar: ఫిబ్రవరి 1న గ్రూప్-1, ఏప్రిల్ లో గ్రూప్-2.. కాంగ్రెస్ సంచలన జాబ్ క్యాలెండర్!
Telangana elections 2023: ప్రభుత్వంపై నిరుద్యోగుల అసంతృప్తిని ఓట్లుగా మలచుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టిపెట్టింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ; గ్రూప్-1, గ్రూప్-2 సహా కమిషన్ నిర్వహించిన అనేక పరీక్షల్లో అవకతవకలు, వరుస వాయిదాల నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు డీఎస్సీలోనూ తక్కువ ఉద్యోగాలుండడం లక్షలాది మంది అభ్యర్థులను నిరాశపరిచింది. ఈ అంశాలను తమ మేనిఫెస్టోలో చేర్చాలంటూ నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి వినతులు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకన్న అధిష్టానం శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగుల అంశానికి పెద్దపీట వేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ తేదీ రోజు ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామో చెప్పి నిరుద్యోగులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ.
ఇది కూడా చదవండి: Congress Manifesto: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో
జాబ్ క్యాలెండర్ ప్రకటన:
2024 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. గ్రూప్ -1 ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభంతో ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మొదలైంది. కాగా, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను రెండు దశలుగా నిర్వహిస్తామని ప్రకటించింది.
గ్రూప్-2: తొలి దశ – ఏప్రిల్ 1, రెండోదశ- డిసెంబరు 15
గ్రూప్-3: తొలి దశ – జూన్ 1, రెండోదశ- డిసెంబరు 1
గ్రూప్-4: తొలి దశ – జూన్ 1, రెండో దశ- డిసెంబరు 12
ఇది కూడా చదవండి: TS Elections 2023: ఈ 8 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ వారే.. కానీ పార్టీలే మారే!
ఏఈ, పంచాయితీరాజ్, నీటిపారుదల, ప్రజారోగ్యం, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ- కాలుష్య నియంత్రణ మండలి: తొలిదశ- మే 1
వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారులు, పశుసంవర్ధక అధికారులు: తొలి దశ- మే 1
ఏఎంవీఐ, టీపీవో, ఏఈవో, హెచ్ఎండబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఆఫీసర్లు, సహాయక హైడ్రాలజిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ సహాయకులు, ఫీల్డ్ సూపర్ వైజర్, డిప్యూటీ సర్వేయర్: తొలి దశ – జూన్ 1, రెండో దశ- డిసెంబరు 1
అభయ హస్తం మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
👉 కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక (జాబ్ క్యాలెండర్)
“ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటా సౌభాగ్యం”
– తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. #CongressManifesto pic.twitter.com/7l1zPNHoEz— Telangana Congress (@INCTelangana) November 17, 2023
యూనిఫాం సిబ్బంది నియామకం: తొలి దశ – ఏప్రిల్ 1, రెండో దశ – డిసెంబరు 15
ఉపాధ్యాయ నియామక పరీక్ష: తొలి దశ – ఏప్రిల్ 1, రెండో దశ – డిసెంబరు 15
స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులు, హాస్పిటల్ సహాయకులు, ఫిజియో థెరపిస్టులు, పారామెడికల్ సహాయకులు: తొలి దశ – మే 1, రెండో దశ – డిసెంబరు 15
డాక్టర్లు – ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలు: తొలి దశ – ఆగష్టు 1
వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ, మండల స్థాయి సాంకేతిక సిబ్బంది: తొలి దశ – జూన్ 1