ఇటీవల వరదలకు విజయవాడ మహానగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. విజయవాడ దుఖఃదాయని అని పేరున్న బుడమేరే ఈ విపత్తుకు కారణమైంది. బుడమేరు వాగుకు గండ్లు పడడం, వాగులోకి సాధారణం కంటే మూడు రెట్లకు పైగా నీరు చేరడంతో ఈ ప్రమాదం తలెత్తింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఓ వైపు వరద బాధితులకు సహాయం చేస్తూనే మరోవైపు బుడమేరు గండ్ల పూడ్చివేతను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు రోజులపాటు వాగు గట్టుపైనే ఉండి పూడ్చివేత పనులు పూర్తి చేయించారు. ఆర్మీసైతం రంగంలోకి దిగి గండ్ల పూడ్చివేతలో ప్రభుత్వానికి సహాయం చేసింది. ప్రస్తుతం వరద ఆగడం, గండ్ల పూడ్చివేత కంప్లీట్ కావడంతో ప్రభుత్వం వరద రాకుండా శాశ్వతంగా చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
పూర్తిగా చదవండి..Chandrababu : ఆపరేషన్ బుడమేరు.. వరదలు రాకుండా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఇదే!
విజయవాడకు మరో సారి వరద రాకుండా ఉండడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ బుడమేరకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించనున్నారు. అనంతరం గడ్లను పటిష్టం చేయనున్నారు.
Translate this News: