TG News: ప్రస్తుత కాలంలో బంధానికి, బంధుత్వాలకి విలువ లేకుండా పోయింది. డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. సొంతవాళ్లనే చంపి ప్రాణాలే తీసి మట్టిలో కలిపేస్తున్నారు. ఇలాంటి మరో దారుణ ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ హాస్టల్ని శ్రీకాంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అదే హాస్టల్లో ఉంటూ శ్రీకాంత్ బామ్మర్ది యశ్వంత్ జాబ్ సెర్చింగ్ చేస్తున్నాడు. కొంతకాలంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీకాంత్.. బామ్మర్ది యశ్వంత్ ఆస్తిపై కన్నేశాడు. ఈ క్రమంలో సుపారి ఇచ్చి శ్రీకాంత్ ను హత్య చేయించాడు.
పూర్తిగా చదవండి..TG News: గచ్చిబౌలిలో ఘోరం.. ఆస్తి కోసం బామ్మర్దిని బావ ఏం చేశాడంటే?
ఆస్తి కోసం బావ తన బామ్మర్దిని చంపిన ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. అప్పులపాలైన శ్రీకాంత్ అనే వ్యక్తి వాటిని తీర్చడం కోసం తన బామ్మర్ది యశ్వంత్ ఆస్తిపై కన్నేశాడు. ఈ క్రమంలో యశ్వంత్ను హత్యచేసి డెడ్ బాడీని కాల్చేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటపడింది.
Translate this News: