Rajanna siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో జరుగుతున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా పీఈటీ జోష్ణ తమను వేధిస్తుందంటూ విద్యా్ర్థులు రోడ్డుకెక్కారు. గురువారం ఉదయం 5 గంటలకే సిరిసిల్ల- సిద్దిపేట ప్రధానరహాదారిపై నిరసనకు దిగారు. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్లో కావాలని వేధింపులకు గురిచేస్తోందని, బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగుల గొట్టి వీడియోలు తీస్తూ సైకోలాగా వ్యవహరిస్తుందని బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ.. ఎక్కడపడితే అక్కడే కొడుతుందని వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ విధులు నిర్వర్తిస్తోంది.
పూర్తిగా చదవండి..Sircilla: సైకో పీఈటీ.. బాలికలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసి దారుణం!
పీఈటీ టార్చర్ తట్టుకోలేక సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు రోడ్డెక్కారు. స్నానం చేస్తుంటే సెల్ ఫోన్లో వీడియోలు తీసి టార్చర్ చేస్తుందంటూ నిరసన చేపట్టారు. పీరియడ్స్ టైమ్లోనూ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జోష్ణను ఎంఈవో సస్పెండ్ చేశారు.
Translate this News: