Ganesh chaturthi: దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యయి. మహానగరాలతోపాటు మారుమూల పల్లెల్లో బొజ్జ గణపయ్య నామ స్మరణ మారుమోగుతోంది. ఇప్పటికే గణేశుడి మండపాలు కొలువుదీరగా ఉదయం 6 గంటలనుంచే భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. 70వ ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది ఖైరతాబాద్ లో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. పెద్దు ఎత్తున హాజరైన భక్తులు, ఉత్సవ కమిటీ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీసి పూజలు ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Ganesh chaturthi: ముస్తాబైన గణనాథుడి మండపాలు.. పలుచోట్ల మొదలైన భక్తుల తాకిడి!
ప్రపంచవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యయి. మహానగరాలతోపాటు మారుమూల పల్లెల్లో బొజ్జ గణపయ్య నామస్మరణ మారుమోగుతోంది. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతికి తొలిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పూజలు చేయనున్నారు.
Translate this News: