AP News: విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని, వారి కష్టాలు వర్ణనాతీతమంటూ ఎమోషనల్ అయ్యారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. బాధితుల మాటలు వింటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందన్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందివ్వలేదని, రోజుల తరబడి మంచి నీళ్లు కూడా లేవంటూ టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతమంది వరదల్లో కొట్టుకు వెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి టీడీపీ ప్రభుత్వం వైపల్యమే కారణమన్నారు. మంత్రులు విహార యాత్రలకు వెళ్లి.. ప్రజలను వరదల్లో ముంచేశారన్నారు. ఇదేదో తాను విమర్శించడానికి చెప్తున్న మాట కాదని, మనం ఏ టీవీ చూసినా, తెలుగుదేశం పార్టీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తెలుస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..Roja : మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారు: మాజీ మంత్రి రోజా
ప్రజలను వరదల్లో ముంచేసి ఏపీ మంత్రులంతా విహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
Translate this News: