Jr NTR: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతమయ్యాయి. భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం పెరిగి ఏపీ(AP), తెలంగాణలోని(Telangana) పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం, ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు తమ నివాసాలు కోల్పోయి తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
పూర్తిగా చదవండి..NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..!
భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావంతో ఎంతో మంది ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు తన వంతు సాయంగా NTR రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ చెరొక 50 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు.
Translate this News: