అది 2020 అక్టోబర్.. ప్రాంతం విజయవాడ-విద్యాధరపురం.. అప్పటికీ వాన దంచికొడుతోంది. అయితే కరెంట్ మాత్రం పోలేదు. దీంతో శివశంకరరావు అనే వ్యక్తి ఇంట్లో కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నాడు. అతనికి తెలియదు కాసేపట్లో అతనే ఓ న్యూస్ కాబోతున్నాడని..! అతను టీవీ చూస్తుండగా సడన్గా ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.. ఏం జరిగిందో తెలుసుకునేలోపే శివశంకరరావు శవమయ్యాడు. కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు అతని ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడలో వర్షం పడిన ప్రతీసారి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఇలాంటి భయాలతోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో ప్రాణనష్టం కూడా సంభవిస్తుంటుంది. తాజాగా భారీ వర్షాలకు విజయవాడ- మొగల్రాజపురం వద్ద కొండచరియలు విరిగిపడగా.. ఓ బాలిక చనిపోయింది..!
పూర్తిగా చదవండి..Vijayawada Landslides Scare: విజయవాడలో కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలు ఇవే.. వర్షం పడితే వారి ప్రాణాలు అరచేతిలోనే..!
విజయవాడలోని గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువ. వాస్తవానికి నగరంలో 30శాతం ప్రజలు కొండ భూభాగాల్లోనే నివసిస్తున్నారు. అయితే వీరికి రక్షణ లేదన్న విమర్శలున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: