Kadambari Jethwani: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలనాలు బయటికొస్తున్నాయి. ఆమె లాయర్ నర్రా శ్రీనివాస్ షాకింగ్ అంశాలు బయటపెట్టారు. ఈ కేసులో ముగ్గురి పోలీసు అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అప్పటి సీపీ కాంతిరాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు.. డీసీపీ విశాల్ గున్నీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేసు పెట్టకముందే, ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్లారని.. పక్కా ప్లాన్తోనే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో కేసు పెట్టించారని లాయర్ నర్రా శ్రీనివాస్ తెలిపారు. సోషల్ మీడియాలో నటిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై ఏపీలో ఉన్న కేసు తప్ప ఇంకో కేసు లేదన్నారు. వేరే రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని రాస్తున్నారని.. అదంతా తప్పు అని స్పష్టం చేశారు. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Kadambari Jethwani: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..
అప్పటి సీపీ కాంతిరాణా టాటా తనపై తప్పుడు కేసు పెట్టారని ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు.10 నుంచి 15 మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారన్నారు. ఈ వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Translate this News: