Badlapur: మహారాష్ట్ర బద్లాపూర్ చిన్నారులపై అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులపై 23 ఏళ్ల స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా టాయిలెట్ లో తమ బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్లను టచ్ చేశాడని బాధిత బాలికలు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ నెల 12న ప్రీ ప్రైమరీ స్కూల్లో ఘటనలో చిన్నారులపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను నిరసిస్తూ మహారాష్ట్రలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఘటనాస్థలానికి సీఎం ఏక్నాథ్ షిండే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Rape case: బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తూ.. బాలికల అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు!
బద్లాపూర్ ప్రైవేట్ స్కూల్ చిన్నారుల అత్యాచారం కేసులో భయంకర నిజాలు బయటకొచ్చాయి. నిందితుడు అక్షయ్ షిండే తమ బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్లను టచ్ చేశాడని బాధిత బాలికలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.
Translate this News: