Independence Day 2024: బ్రిటీష్ బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఆగస్టు 15 భారతీయులకు ప్రత్యేకమైన రోజు. అందుకనుగుణంగానే ఈసారి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 78వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఎర్రకోట (Red Fort) నుంచి 11వ సారి జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో సిద్ధం అయిపోయారు. వీధివీధినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక ప్రధాని మోదీ పతాకావిష్కరణ చేయనున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతిచోటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా సన్నాహాలు పూర్తి చేశారు. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీ మెట్రో కూడా రికార్డు నమోదు చేసింది.
పూర్తిగా చదవండి..Independence Day 2024: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరికొద్దిసేపట్లో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
Translate this News: