TG Education: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు త్వరలోనే కళకళలాడనున్నాయి. విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక బోసిపోయిన క్లాస్ రూముల్లో ఇకపై నిరంతరం పాఠ్యాంశాల బోధన జరగనుంది. విద్యావ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్.. త్వరలోనే కొత్త టీచర్లను నియమించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నిరసనలను పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. తాజాగా అన్ని డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ లను విడుదలచేసింది. దీంతోపాటు ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది.
పూర్తిగా చదవండి..TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు!
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కొత్త టీచర్లను నియమించే ప్రక్రియలో వేగం పెంచింది రేవంత్ సర్కార్. మరో రెండు నెలల్లో 11,062 టీచర్, 1,392 ఇంటర్, 544 డిగ్రీ, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Translate this News: