2019 లో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ తరపున పోటీ చేసిన మహింద రాజపక్సే సోదరుడు గోటబయ రాజపక్సే విజయం సాధించారు. తదనంతరం, 2020లో జరిగిన పర్లీ ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించడంతో మహింద రాజపక్సే ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత
కరోనా కారణంగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగిన తర్వాత గోటబయ రాజపక్సే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు.నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో మహీందా రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గోటబయ రాజపక్సే విదేశాలకు పారిపోయారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సా కుటుంబం వారసుడు!
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సా కుటుంబం వారసుడు భరిలో దిగనున్నాడు.సెప్టెంబర్21 న జరిగే ఎన్నికల్లో నమల్ రాజపక్సా పోటీ చేస్తున్నట్టు కుటుంబం ప్రకటించింది.ఎస్ ఎల్ పీపీ పార్టీ తరపున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్సా పేరును ప్రతిపాదించారు.
Translate this News: