Stock Market Updates Today : నిన్న ఇన్వెస్టర్స్ (Investors) కి రక్త కన్నీరు తెపించిన తరువాత ఈరోజు మార్కెట్లు పుంజుకుంటున్నాయి. అమెరికా (America) లో రెండు సంవత్సరాల తరువాత అత్యంత దారుణంగా మార్కెట్లు పడిపోయినా.. దేశీయంగా మాత్రం ప్రస్తుతం ఆ ప్రభావం కనిపించడం లేదు. ఈరోజు అంటే ఆగస్టు 6న మార్కెట్ ప్రారంభం కావడంతోనే ఇండెక్స్ లు పైకి కదిలాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకూ ఎగబాకి 79,972 పాయింట్ల వద్దకు చేరుకుంది. తరువాత కాస్త కిందికి దిగివచ్చి ప్రస్తుతం అంటే ఉదయం 10 గంటల సమయానికి 79670 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 280 పాయింట్లు పెరిగింది. 24,340 స్థాయిలో ట్రేడవుతోంది.
పూర్తిగా చదవండి..Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ!
నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
Translate this News: