Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో 8 రోజుల ఆట తర్వాత, భారత్ (India) 3 పతకాలతో 50వ స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు రోజు భారత్ 47వ ర్యాంక్లో ఉండగా, రెండు రోజులుగా ఎలాంటి పతకం సాధించకపోవడంతో నష్టపోయింది. ఇప్పుడు ఈ క్రీడల మహాసంగ్రామం మరో 8 రోజులు కొనసాగుతుంది. గత రెండు రోజుల్లో భారత అథ్లెట్లు 5 మెడల్ ఛాన్స్ లను కోల్పోయారు. 8వ రోజు ఆటలో మను భాకర్ హ్యాట్రిక్ మిస్సయింది. దీపికా కుమారి, భజన్ కౌర్ కూడా ఆర్చరీలో పతక రౌండ్కు చేరుకోలేకపోయారు. ఇది కాకుండా, నిశాంత్ దేవ్ బాక్సింగ్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పుడు 9వ రోజు, లక్ష్య సేన్ – లోవ్లినా బోర్గోహైన్ వంటి పెద్ద పేర్లు ఈ రోజు మెడల్ ఆశలు రేకెత్తిస్తున్నాయి. షూటింగ్లో మరోసారి పతకం సాధించే అవకాశం ఉంటుంది.
పూర్తిగా చదవండి..Paris Olympics India Schedule : లక్ష్యసేన్ లక్ష్యం సాధించేనా? హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్.. ఈరోజు ఒలింపిక్ ఈవెంట్స్ ఇవే!
పారిస్ ఒలింపిక్స్లో 8 రోజుల ఆట ముగిసింది. భారత్ 3 పతకాలు సాధించి పతకాల పట్టికలో 50వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ 9వ రోజు అందరి దృష్టి భారత హాకీ జట్టు, లక్ష్య సేన్ అలాగే లోవ్లినా బోర్గోహైన్లపై ఉంది. భారత్ పాల్గొనే ఈవేట్స్ షెడ్యూల్ ఆర్టికల్ లో ఉంది.
Translate this News: