నైజీరియాకు చెందిన జస్టిస్ న్వాబోర్ (41) కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చారు. ఫ్యాక్టరీల నుంచి బట్టలు కొనడం, అమ్మడం వ్యాపారం చేసేవాడు. కానీ ఆ వ్యాపారంలో అతడు నష్టపోయాడు.ఇలా ఎనిమిది నెలల క్రితం బెంగళూరు వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బెంగళూరులో ఉంటూ కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయించటం అలవాటు చేసుకున్నారు. వారి ద్వారా ముంబై నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరులో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. తాజాగా దీనిపై సీసీబీ, పోలీసులకు సమాచారం అందింది.
పూర్తిగా చదవండి..నైజీరియన్ వ్యక్తి వద్ద రూ. 6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం!
బెంగళూరులో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.6 కోట్ల విలువైన MDMA క్రిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు.అతడు నైజీరియాకు చెందిన జస్టిస్ న్వాబోర్ గా పోలీసులు గుర్తించారు.
Translate this News: