Bangalore: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 23న పీజీ హాస్టల్లో ఉంటున్న కృతి అనే యువతిని గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు అభిషేక్ను మధ్యప్రదేశ్లో పట్టుకున్న పోలీసులు విచారణ కోసం అతడిని కర్ణాటకకు తరలించారు. సీసీ ఫుటేజ్లో రికార్డైన యువతిని హత్య చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో ఈ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితుడి కోసం మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు భోపాల్లో దొరికాడు.
పూర్తిగా చదవండి..Bangalore: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!
బెంగళూరులో కృతి అనే యువతిని గొంతుకోసి హత్య చేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మధ్యప్రదేశ్లో నిందితుడు అభిషేక్ను పట్టుకున్న పోలీసులు విచారణ కోసం అతడిని కర్ణాటకకు తరలించారు. తన ప్రియురాలు దూరమవడానికి కృతికుమారే కారణమని ప్రియుడు అభిషేక్ అర్థరాత్రి హాస్టల్లోకి వెళ్లి హత్య చేశాడు.
Translate this News: