Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అంటూ ఎగతాళి చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు లేదని ఆరోపిస్తున్న సీఎం, మంత్రులు.. రాష్ట్ర బడ్జెట్లో ఒక్క నియోజకవర్గం పేరు లేనందుకు రాజీనామా చేస్తారా అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ!
అసెంబ్లీలో భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగతాళి చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమన్నారు. హామీల అమలు కాంగ్రెస్కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు.
Translate this News: