BSNL: ఒక్కసారిగా టారిఫ్ పెంచేసిన జియో..ఎయిర్టెల్ టెలికాం కంపెనీలపై యూజర్స్ గుర్రుగా ఉన్నారు. ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డారు. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉన్నప్పటికీ దాని 4జీ నెట్వర్క్ ఇప్పటికీ సరిగా లేదు. దీంతో తప్పనిసరై టారిఫ్ లు ఎక్కువైనా పాత వాటిలోనే కొనసాగుతున్నారు. అయినా.. బాయ్ కాట్ జియో పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కూడా జరుగుతోంది. చాలామంది బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ కూడా అయ్యారు. ఇది కష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ కి వరంగా మారిందని చెప్పవచ్చు. ఈలోపు మరో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. టాటా గ్రూప్ నాకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ బీఎస్ఎన్ఎల్ తో కలుస్తోందని వార్తలు వచ్చాయి. అది పూర్తిగా నిజం కాకపోయినా.. బీఎస్ఎన్ఎల్ మరో లెవెల్ కి వెళ్ళడానికి టీసీఎస్ సహాయం చేయబోతోంది.
పూర్తిగా చదవండి..BSNL: బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే!
జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు పెంచడంతో యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రూ.80 వేల కోట్లకు పైగా కేటాయించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1500 కోట్ల రూపాయల విలువైన డీల్ కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది
Translate this News: