Nepal : నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) లో విమానం కుప్పకూలింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ)లో సౌర ఎయిర్లైన్స్ విమానం కూలి (Plane Crash) మంటలు చెలరేగాయి. 19 మంది ప్రయాణికులతో పోఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో రన్వేపై నుంచి జారిపడిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..Plane Crash: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!
నేపాల్లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
Translate this News: