AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
శనివారం కూడా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.
AP: ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ-ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య గండ్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
Translate this News: