వివరాల్లో వెళ్తే.. నిందితుల్లో ఒకరితో ఇన్స్ట్రాగామ్లో బాలికకు పరిచయం ఉంది. అయితే.. ఆ స్నేహంతో కలవాలంటూగా ఒక రోజు బాలికను బయటకు పిలిచాడు. దీంతో ఆ బాలిక.. ఒక స్థలానికి వచ్చిది. ఆమె రాగానే కారులో వేచి ఉన్న మరో ఇద్దరు స్నేహితులు రైడింగ్కు వెళ్దామంటూ ఆహ్వానించారు. బాలిక కారులోకి ఎక్కగానే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఈ దృశ్యాలను మొబైల్లో వీడియోలు తీశారు. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని బాలికను తమతో బయటకు రావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ బయపెట్టారు. లేదంటే వీడియో పేరెంట్స్కు పంపిస్తామని బెదిరిస్తున్నారు. బాలిక వారితో వెళ్లేందుకు నిరాకరిచటంతో నిందితులు మాత్రం అన్నంత పని చేశారు. అత్యాచార వీడియోను అమ్మాయి తల్లిదండ్రులకు పంపించారు. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. రగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తూ.. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Crime: మధ్యప్రదేశ్లో ఘోరం.. కారులో 9వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్
తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన మధ్యప్రదేశ్లో కలకలం రేపుతోంది. బాలికపై కదులుతున్న కారులోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: