Ananathapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో ఐదు ఫ్యాక్టరీలు విడుదల చేసే దుమ్ము, పొగ వల్ల పంట చేతికందక తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దీంతో స్పందించిన బొమ్మనహాల్ తహశీల్దార్ స్థానిక రైతన్నలతో కలిసి క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించారు.
పూర్తిగా చదవండి..AP: వారికి న్యాయం జరిగేలా చూస్తాం: తహశీల్దార్
అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో ఫ్యాక్టరీలతో నష్టపోతున్న పంట పొలాలను తహశీల్దార్ రామాంజినమ్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామన్నారు. రైతన్నలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: