PM Kisan Yojana: కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చేసింది. ఒక్కరోజు గడిస్తే చాలు బడ్జెట్ లో ఏముందో.. ఎలా ఉంటుందో తేలిపోతుంది. ఈలోగా వివిధ రంగాల నుంచి ఎన్నో అంచనాలు.. అభ్యర్ధనలు వెలువడుతున్నాయి. బడ్జెట్ లో ఈసారి యువత, మహిళలు, రైతులు, కూలీలు ఈ నాలుగు వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. అన్నదాతలుగా ఉండాల్సిన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దాదాపు 10 కోట్ల మంది రైతులకు చేరువైంది. అయితే, ఇది ఇంకా చాలా మంది చిన్న రైతులకు చేరలేదనేది నిజం. అంతేకాకుండా, ఈ పథకం కింద ఏడాదిలో ఇచ్చే రూ.6 వేల గ్రాంట్ సరిపోదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని రూ.8వేలకు పెంచాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం కూడా దీనిని సానుకూలంగా తీసుకుంటోందని భావిస్తున్నారు. అయితే, ఈ బడ్జెట్లో పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచుతారో లేదో ఖచ్చితంగా తెలియదు. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో బడ్జెట్ లో కీలక ప్రకటన చేయవచ్చనే ఆశతో రైతాంగం ఉంది.
పూర్తిగా చదవండి..PM Kisan Yojana: బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెబుతారా? పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా?
కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చేసింది. ఒక్కరోజు గడిస్తే బడ్జెట్ లో ఏముందో.. ఎలా ఉంటుందో తేలిపోతుంది. ఈలోగా అన్ని రంగాల నుంచి అంచనాలు చాలా ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బు 6 వేల నుంచి 8వేలకు పెంచవచ్చని ఆశిస్తున్నారు.
Translate this News: