Murder Case: ఏపీలోని ప్రొద్దుటూరులో ఓ వివాహేతర సంబంధం కేసు జనాలను ఉలిక్కిపడేలా చేసింది. మరొక పురుషుడితో భార్య సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఆమెను దారుణంగా హతమార్చి రహస్య ప్రాంతంలో పాతిపెట్టిన భర్త కటకటాలపాలవగా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని మైలవరంమండలం దోడియంకు చెందిన రేష్మాతో పదేళ్ల క్రితం అమృతనగర్ కు చెందిన అన్వర్ బాషాకు వివాహం జరిగింది. వివాహం అయిన కొన్నాళ్లకు భార్య రేష్మ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో పలుమార్లు హెచ్చరించాడు. అయితే రేష్మా తీరు మార్చుకోకుండా అలాగే చేస్తుండటంతో గొడవపెట్టుకున్నాడు బాషా. దీంతో పది రోజుల క్రితం పెన్నా నగర్ లోని పిన్నమ్మ ఇంటికి వెళ్లింది రేష్మా.
పూర్తిగా చదవండి..Proddatur: భార్య వివాహేతర సంబంధం.. భర్త చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!
అక్రమ సంబంధం అనుమానం ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. ప్రొద్దుటూరు దోడియంకు చెందిన అన్వర్ బాషా తన భార్య రేష్మను అనుమానంతో గొంతుపిసికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Translate this News: