Union Budget 2024: కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముహూర్తం దగ్గరకొచ్చేసింది. రేపు అంటే జూలై 23న బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి పరిశ్రమల వరకు అందరూ ప్రభుత్వం నుంచి రాయితీలు ఆశిస్తున్నారు. ఆహారం, పానీయాల కంటే వైద్య ఖర్చులు సామాన్యులపై భారం పడుతున్నాయి. మీ కుటుంబంలోని ఒక వ్యక్తి 4-5 రోజుల పాటు ప్రఖ్యాత ఆసుపత్రిలో చేరినట్లయితే, బిల్లు మొత్తం లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. సాధారణంగా, వైద్య చికిత్స ఖర్చులను తగ్గించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై భారీ టాక్స్ లు కూడా విధిస్తారు. ఈ యూనియన్ బడ్జెట్లో పన్ను భారాన్ని తగ్గించాలని, ఆరోగ్య బీమా తీసుకునే వారికి మరిన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలని అటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి.. ఇటు పాలసీ హోల్డర్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Union Budget 2024: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి మరింత టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివలన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలు మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2024లో పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు
Translate this News: