Muslim Womens: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ మేరకు 125 సీఆర్పీసీ ప్రకారం డివోర్స్ తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేసును పరిశీలించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో విడాకుల తర్వాత వారు భరణానికి అర్హులేనని, భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఆ వ్యక్తి పిటిషన్ ను కొట్టివేసింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Divorce case: ముస్లిం మహిళలకు విడాకుల భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.125 సీఆర్పీసీని సవాల్ చేస్తూ ఓ భర్త వేసిన పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం.. 125 సెక్షన్ వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Translate this News: