APPSC: ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ ఎత్తున జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీపీఎస్సీ కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కొంతమందికి 99శాతానికి పైగా మార్కులు రావడం పలు అనుమాలకు దారితీసింది. ఏపీలో ఒక్కరు కూడా ఇప్పటివరకూ 99శాతానికి పైగా మార్కులు సాధించకపోగా.. ఇంటర్వ్యూలు చేసే బోర్డులు సైతం ఈ స్థాయిలో మార్కులు ఎన్నడూ వేయలేదు. అయితే వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి సంచలనాలు చోటుచేసుకోవడంపై అధికారిక యంత్రాంగంపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి సంచలన విషయాలు!
ఏపీలో 2022 గ్రూప్-1 ర్యాంకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో వెలువడిన కథనాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు సపోర్టుగా పనిచేసిన అధికారులు, నాయకులతోపాటు జగన్ బంధువులంతా టాపర్లుగా నిలవడం చర్చనీయాంశమైంది.
Translate this News: