Telangana: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం అదే మార్గంలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల తోపాటు భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి రోజూ వారి సమయం రిజిస్ట్రేషన్ల సేవలతోనే గడిచిపోతోంది.
పూర్తిగా చదవండి..TS: డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్.. రెవెన్యూశాఖ కీలక సంస్కరణలు..!
ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
Translate this News: