Breaking: నంద్యాల జిల్లాలో చిరుత పులి దాడి కలకలం సృష్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాజాగా, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్లలో అటవీ శివారులో చిరుత పులి దాడి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత దాడిలో ఓ మహిళ దారుణంగా బలైయింది.
పూర్తిగా చదవండి..Breaking: కట్టెల కోసం వెళ్లిన మహిళ తలను తిన్న పులి.. ఏపీలో దారుణ ఘటన!
నంద్యాల జిల్లా మహానంది మండలం పచ్చర్ల అటవీ శివారులో దారుణం చోటుచేసుకుంది. పాపమ్మ అనే మహిళ అడవీలో కట్టెపుల్లలు సేకరిస్తుండగా చిరుత పులి దాడి చేసింది. దాడిలో పాపమ్మకు తీవ్రగాయాలు అయ్యాయి. పాపమ్మ తలను చిరుత సగం వరకు తినేసింది.
Translate this News: