NEET-UG 2024 Re-Exam: నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు సాధించిన 1563 మంది విద్యార్థులకు ఈరోజు రీ ఎగ్జామ్ జరగనుంది. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆరు కేంద్రాల్లో ఒకే షిప్టులో పరీక్ష జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు ఉంటారు. జూన్ 30న ఫలితం రానుంది. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.20 గంటలకు ముగుస్తుంది.
పూర్తిగా చదవండి..NEET- UG 2024: నీట్ ఎగ్జామ్ విద్యార్థులకు ఈరోజు మళ్ళీ పరీక్ష.. ఎందుకంటే..
ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థుల మార్కులను రద్దు చేసి, వారికి మళ్లీ పరీక్షకు అవకాశం కల్పిస్తామని ఎన్టీఏ జూన్ 13న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈమేరకు ఈరోజు ఒకే షిప్టులో 6 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.
Translate this News: