Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం భద్రత కోసం మోహరించిన ఎస్ఎస్ఎఫ్ జవాన్ కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 5.25 గంటలకు చోటుచేసుకుంది. ఆ సైనికుడి పేరు శత్రుఘ్న విశ్వకర్మ. 25 ఏళ్ల శతృఘ్న అంబేద్కర్ నగర్ నివాసి. ఉదయం రామమందిరం కాంప్లెక్స్లో కాల్పుల శబ్ధం వినిపించడంతో తోటి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ శతృఘ్న రక్తపు మడుగులో పడి ఉండడం చూశారు. తుపాకీ తూటా తగిలినట్లు గమయించారు. తోటి సైనికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి గాయపడిన సైనికుడిని ట్రామా సెంటర్కు తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో కలకలం.. తుపాకీతో కాల్చుకుని జవాన్ మృతి
అయోధ్య రామమందిరంలో ఒక జవాన్ మృతి చెందాడు. ఈ తెల్లవారుజామున రామమందిరం కాంప్లెక్స్ లో తుపాకీ శబ్దం వినిపించింది. భద్రతా సిబ్బంది అక్కడ గాయాలతో ఉన్న శత్రుఘ్న విశ్వకర్మ(25) అనే జవాన్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, డాక్టర్లు ఆ జవాన్ మృతి చెందినట్టు ప్రకటించారు.
Translate this News: