JD Lakshmi Narayana Tweet : నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అయ్యిందంటూ… ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఒక దేశాన్ని నాశనం చేయాంటే ఆటం బాంబులు
అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్!
నీట్ పేపర్ లీక్ అయ్యిందంటూ...ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: